Thursday, May 9, 2024
- Advertisement -

‘శీతాకాలం వెన్నెల్లోన ….’ యాపిల్ అవార్డు కొట్టేశాడే

- Advertisement -

‘దేవి’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు భారీ బడ్జెట్ చిత్రాలన్నింటికి సంగీతాన్ని అందిస్తున్న దేవి, తన స్వరాలతో అటు మాస్ ఆడియన్స్ ను, ఇటు క్లాస్ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేస్తున్నాడనటంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు.

ఇటీవల వచ్చిన కుమారి 21 ఎఫ్ కు సంగీతంతో పాటు లిరిక్స్ ను కూడా అందించిన దేవి కుర్రకారు ఓ ఊపుఊపేశాడు. అదే విధంగా త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన ‘S/O సత్యమూర్తి’ చిత్రానికి గాను యాపిల్ స్టోర్ ఐట్యూన్స్ నుంచి బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. ఇదే విషయాన్ని దేవి తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

నిజమే కదా నిజమైన ప్రతిభ ఎక్కడ ఉన్నా దాగదు మరి…వెతుక్కుంటూ వస్తుంది. యాపిల్ అవార్డు కొట్టేసిన ‘S/O సత్యానంద్’ మరిన్ని అవార్డులు  గెలుచుకోవాలని కోరుకుంటూ ఆద్యా న్యూస్ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -