Monday, May 6, 2024
- Advertisement -

ఇంటెలిజెంట్ `లెట్స్ డూ` పాట విడుద‌ల‌

- Advertisement -

స్నేహానికి ప్రాణ‌మిచ్చే డార్లింగ్ ప్ర‌భాస్‌

ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపమని.. ప‌రిశ్ర‌మ‌లో స్నేహానికి విలువ ఇచ్చే అతి కొద్దిమందిలో ప్రభాస్ ఒకడని ప్ర‌క‌టించారు నిర్మాత సీకే క‌ల్యాణ్‌, మెగా న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్. ప్ర‌భాస్‌ను పొగ‌డ్త‌ల‌తో వీరిద్ద‌రూ ముంచెత్తారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా సీకే క‌ల్యాణ్ నిర్మాణంలో వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఇంటిలిజెంట్ సినిమా వ‌స్తోంది. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత సినిమాలోని లెట్స్ డూ పాట‌ను ప్ర‌భాస్‌తో విడుద‌ల చేయించారు.మామూలుగా ఫోన్ చేసి రమ్మనగానే ఫంక్షన్‌కు వచ్చాడని – ప్రభాస్ రాకతో తమ యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నామని ప్ర‌క‌టించారు. ప్రభాస్ తమ ఇంట్లో మనిషిలా చాలా ఫ్రెండ్లీ గాఉంటాడని పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలని తేజూ చెప్పాడు.

తనకు వినాయక్ చాలా మంచి మిత్రుడని…ఫోన్ చేసి మొహమాటంగా ఫంక్షన్‌కు రావడం కుదురుతుందా అని అడిగారని.. మీరు మెసేజ్ పెట్టండి.. ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని చెప్పానని ప్రభాస్ అన్నాడు. యోగి సినిమాకు ఎంజాయ్ చేసినట్లు తాను ఏ సినిమాకు ఎంజాయ్ చేయలేదని ప్రభాస్ పేర్కొన్నాడు. రాజమౌళిగారికి కూడా ఇదే విషయాన్ని చెప్పానని వినాయక్ గారు హీరోలకు ఫ్రీడమ్ ఇస్తారని చెప్పాడు. వినాయక్ గారు హీరోలను బాగా సుఖపెట్టేస్తారని. అలా సుఖ పెట్టకూడదని తాము ఇంకా చాలా కష్టపడాలని అన్నాడు. తేజూ ‘సాహో’ షూటింగ్‌కి వచ్చాడని వినాయక్ గారితో చేయడం చాలా లక్కీ అని తేజూతో చెప్పానని గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి గారి పాటల్లో `చమకు చమకు చాం…` పాట తన ఫేవరెట్ అని.. ఆ పాట‌కు చిరంజీవిగారు సూపర్బ్‌గా స్టెప్పులేశారని అదే పాటను తేజూ ఎలా చేశాడో చూడాలని వెయిట్ చేస్తున్నానని ప్ర‌భాస్ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించాడు.

https://www.youtube.com/watch?v=oymjqNIhFt4

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -