Tuesday, April 23, 2024
- Advertisement -

సాయి పల్లవి నుంచి బ్యాక్ టూ బ్యాక్ మూవీస్..!

- Advertisement -

మలయాళం ప్రేమమ్ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ బ్యూటీ సాయి పల్లవి. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సాయి పల్లవి కి గొప్ప పేరు తీసుకువచ్చింది. ఆమె తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ఫిదా సినిమాకు యూత్ నిజంగానే ఫిదా అయ్యారు. ఆ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఇక తెలుగులో ఆమె వరుసపెట్టి సినిమాలు చేస్తుందని అంతా భావించారు.అయితే ఆమె అనూహ్యంగా ఫిదా హిట్ తర్వాత కోలీవుడ్ పై దృష్టి పెట్టారు. ధనుష్, సూర్య వంటి హీరోలతో నటించారు.

తెలుగులో పెద్ద హీరోల సరసన ఛాన్స్ వచ్చినా ఆమె అంగీకరించలేదు. సెలెక్టెడ్ మూవీస్ లోనే ఆమె నటిస్తున్నారు. పారితోషికం ఎంత ఇస్తామన్నా తన పాత్ర నచ్చని సినిమాలకు ఆమె ఓకే చెప్పడం లేదు. ఫిదా తర్వాత సాయి పల్లవి చేసిన ఎంసీఏ మూవీ ఓ మోస్తారు హిట్ అయినప్పటికీ ఇంతవరకు బ్లాక్ బస్టర్ పడలేదు. కోవిడ్ కారణంగా షూటింగ్ పూర్తయిన చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. వీటిలో సాయిపల్లవి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి వరుసగా తెలుగులో విడుదల అవుతున్నాయి. ఆమె నటించిన మూడు తెలుగు సినిమాలు ఒకేసారి తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత థియేటర్లు తెరుచుకోగానే సాయిపల్లవి నటించిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా రాబోతున్నాయి. ముందుగా శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య – సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రానా,సాయి పల్లవి మూవీ విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాలతో పాటు నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ లో కూడా సాయి పల్లవే హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాల అనంతరం ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిదా తర్వాత సాయిపల్లవి నటించిన ఇన్ని సినిమాలు ఎప్పుడూ ఒకేసారి విడుదల కాలేదు. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఒక్క మామిడి పండు ధర రూ. 1000 .. అంత స్పెషల్​ ఏమిటీ అంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -