దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో ఇంత తొందరగా పాపులర్ అయిన కథానాయిక ఈ మధ్య కాలంలో ఎవరైన ఉన్నారంటే అది కేవలం సాయి పల్లవి మాత్రమే. ఇప్పుడు ఈమె కోసం హీరోలు, దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. మలయాళ సినిమాతో ఇతర రాష్ట్రాల్లో అభిమానుల్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఫిదా మూవీతో తెలుగునాట పెను సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ఎవరి నోట విన్న ఆమె మాటే.. ఆ రెంజ్ లో మనవాళ్లని ఆమె ఫిదా చేసింది. ఇంతమంది కుర్రాళ్ల మనసులను దోచేసుకున్న సాయి పల్లవి మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా..? తమిళ హీరో సూర్య అంటే సాయి పల్లవికి తెగ ఇష్టమట. అతడికి బ్లడ్ ఫాన్ని అంటూ చెప్పుకుంటోన్న సాయి పల్లవి అతనితో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానంటోంది. సూర్యతో నటించే అవకాశం వస్తే కథ, పారితోషికం ఏవీ అడగనని, కళ్లు మూసుకుని సైన్ చేసేస్తానని, సూర్య అంటే తనకి అంత ఇష్టమని చెప్పింది.
ఇంత పేరు వచ్చిన తర్వాత ఫేవరెట్ హీరో పేరు చెప్పడానికి ఎవరైనా జంకుతారు. ఒకరి పేరు చెబితే మరొకరు హర్ట్ అవుతారని అని వెనకాడతారు. కానీ సాయి పల్లవి మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. ఈ నిజాయతీనే సాయిపల్లవిని ఈ రెంజ్ స్టార్ చేసిందేమో మరి.
https://www.youtube.com/watch?v=gWaKn1SPxLw&t=1s