Tuesday, May 14, 2024
- Advertisement -

అలాంటి పాత్రలకే ఓకే చెబుతుందట ఫిదా పిల్ల

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మాలీవుడ్ బ్యూటీలు ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. అందులో కొంత మంది మంచి సక్సెస్ బాటలో నడిచారు. ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తర్వాత తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా చిత్రంతో వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తర్వాత తెలుగు,తమిళ, మళియాళ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది.

తాజాగా సాయి పల్లవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సాయి పల్లవి కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకోవడం లేదట. తన ఇమేజ్ కి తగ్గ సినిమాల్లో మాత్రమే నటిస్తుందని.. అది కూడా హీరో స్థాయికి తగ్గ పాత్రల్లో నటిస్తానని అంటుంది ఈ అమ్మడు. ఇటీవల పవన్ కళ్యాణ్ సరసన ‘అయ్యప్పన్ కోషియం’రీమేక్‌లో నటించే అవకాశాన్ని కాదనుకుంది. చిన్న పాత్ర అనే కారణంతో తిరస్కరించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన మూవీస్ పై మంచి అంచనాలే పెట్టుకుంది. ఆ అమ్మడి స్థాయికి తగ్గ హీరోయిన్ పాత్రలుంటేనే ఆమెను సంప్రదిస్తున్నారు మేకర్స్. హీరోలకి సమానంగా ఆమె కోసం పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. మొత్తానికి పెద్ద హీరోల సరసన చిన్న పాత్రలు చేసేందుకు అంగీకరించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -