- Advertisement -
అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది హీరోయిన్ సాయి పల్లవి. త్వరలో తాను కమల్ హాసన్ మూవీలో కనిపించబోతున్నట్లు తెలిపింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్స్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా తీయబోతోంది.
ఎస్కే-21 టైటిల్తో తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా చేయనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
దేశభక్తి కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్గా రష్మికను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను గార్గి అనే ఓ కొత్త సినిమా చేస్తున్నట్లు కూడా సాయి పల్లవి వెల్లడించింది.