Sunday, May 5, 2024
- Advertisement -

మ‌హేష్‌కు నో చెప్పిన సాయి ప‌ల్ల‌వి.. ఎందుకంటే…

- Advertisement -

దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ హిరోయిన్స్‌ కూడా ప్రిన్స్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎదురుచూస్తుంటారు. మహేష్ పక్కన నటిస్తే చాలు అని చాలా మంది అందాల భామలు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఓ హిరోయిన్‌ మహేష్ సరసన నటించడానికి ఓ హీరోయిన్ నో చెప్పింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు… రౌడీ బేబీ సాయిపల్లవి. మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటించే సినిమాకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ చిత్రంలో మహేష్ సరసన సాయిపల్లవి అయితే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ భావించింది. సాయిపల్లవి పేరును స్వయంగా అనిల్ రావిపూడి స‌జెస్ట్ చేశార‌ట‌.కానీ క‌థ విన్న సాయి ప‌ల్ల‌వి నిర్మోహ‌మాటంగా నో అని చెప్పింద‌ట‌.

గతంలో చాలా మంది డైరెక్టర్లకు సాయి ప‌ల్ల‌వి నో చెప్పిన సందర్భాలు అనేకం. అయితే దీనికి కార‌ణం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానాతో నటించే విరాటపర్వం సినిమా డేట్స్ క్లాష్ కావడం కూడా ఓ కారణమని టాక్‌. అయితే ఈ ఛాన్స్ ష్మిక మందన్న కొట్టేసిన‌ట్టు సినీ వర్గాల స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -