Wednesday, May 22, 2024
- Advertisement -

ఛ‌లో ద‌ర్శ‌కుడితో మెగా హీరో….?

- Advertisement -

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లక్ ఏమిటో గాని ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా ఆఫర్స్ మాత్రం దక్కడం లేదు. ప్లాపు సినిమాలు వ‌చ్చినా క్రేజ్ త‌గ్గ‌డంలేదు. సాయితో సినిమాలు చేసేందుకు డైరెక్ట‌ర్లు ముందుకు వ‌స్తున్నారు. త్వరలో తనకు లైఫ్ ఇచ్చిన మొదటి బ్యానర్ లో ఈ మెగా అల్లుడు మరోసారి కనిపించనున్నాడట.

ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో మంచి మార్కులు కొట్టేసినదిగా ‘ఛలో’ కనిపిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. టేకింగ్ పరంగా వెంకీ కుడుములకి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన తదుపరి చిత్రం సాయిధరమ్ తో ఉండనుందని సమాచారం.

వెంకీ కుడుముల కథ వినిపించడం .. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒప్పుకున్నాడు. ఈ సినిమాను నిర్మించడానికి గీతా ఆర్ట్స్ వారు ముందుకు రావడం జరిగిపోయాయని అంటున్నారు. కథా కథనాల విషయంలో గీతా ఆర్ట్స్ వారు ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడతారో తెలిసిందే.

తేజ్ ఐ లవ్ యు’ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న సాయిధరమ్ తేజ్, ఆ తరువాత కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాతనే ఒక వైపున గోపీచంద్ మలినేనికి .. మరో వైపున వెంకీ కుడుములకి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ రెండు సినిమాలలో ఆయన ఏ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -