అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తీ సురేష్ చేస్తుంది.ఓ జర్నలిస్ట్ పాత్రలో హీరోయిన్ సమంత కనిపిస్తుంది.విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ పెంచింది.సమంత అసిస్టంట్గా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.‘మహానటి’ నుండి ఒక్కటొక్కటిగా పోస్టర్స్ను రిలీజ్ చేస్తున్న టీమ్ ,తాజాగా ఓ సర్ఫైజ్ న్యూస్ ని ప్రకటించింది.
ఏప్రిల్ 14న ఈ చిత్ర టీజర్ని విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఉన్న సమంత, విజయ్ దేవరకొండల లుక్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మధురవాణిగా సమంత, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండ ఈ పోస్టర్లో ఆకట్టుకుంటున్నారు.ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని డబ్బింగ్ పనుల్లో బిజిగా ఉంది.