మరో సినిమా డేట్స్ మార్చుకున్న శర్వానంద్
ఒక్క సినిమా తెలుగు సినీ పరిశ్రమలో అందరి నోళ్లలో నానిన పేరు భానుమతి కాదు కాదు సాయి పల్లవి. వరుణ్తేజ్తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుత హ అనిపించింది. ఓ అమ్మాయి తిడితే కూడా ఇంతందంగా ఉంటుందని నిరూపించింది. కేవలం ఆమె నటనతోనే సినిమా నడిచిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటోంది. దాదాపు నాలుగైదు సినిమాలు ఆమె చేతుల్లో ఉన్నాయి. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయం అందుకుంది.
పల్లవి ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా అంటే.. ఆమె డేట్స్ కోసం ఇతర హీరోలు డేట్స్ వదులుకునేంత. ప్రస్తుతం శర్వానంద్తో నటించేందుకు ఒప్పుకుందంట. హను రాఘవపూడి దర్శకత్వంలో తీస్తున్న సినిమాలో శర్వానంద్తో నటించాలి. అయితే ఆమె ప్రస్తుతం బిజీగా ఉండడంతో శర్వానంద్ తన డేట్స్ సర్దుబాటు చేసుకున్నాడట. సాయి పల్లవి తప్ప ఆ సినిమాలో ఆ పాత్రకు ఎవరు సెట్ కారని చిత్ర బృందం భావించింది. దీంతో శర్వా సుధీర్ వర్మతో చేయబోతున్న సినిమా డేట్స్ మొత్తాన్ని మార్చేశాడు. మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే హను ప్రాజెక్టుకు శర్వా రెగ్యులర్ గా హాజరుకాబోతున్నాడట. వీలైనంత తొందరగా తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకొని మరో ప్రాజెక్ట్పై దృష్టి పెడతాడట. సాయి పల్లవి కోసం మొత్తానికి శర్వానంద్ మరో సినిమా డేట్స్ ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.