ఫిదా సినిమా తరువాత ఇప్పటి వరకు కొత్త సినిమా మొదలు పెట్టలేదు.ఫిదా సినిమా విడుదలై సంవత్సన్నర కావస్తుంది.వరుణ్ తేజ్,సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఫిదా మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే తన కొత్త సినిమాను మొదలుపెట్టే పనిలో పడ్డాడు శేఖర్ కమ్ముల. టాలీవుడ్ లో దర్శకులందరికి బిన్నంగా ఉండే శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నాడా అనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆయనకు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.
ఏషియన్ సునీల్ నిర్మాణ సారథ్యంలో సినిమా చేయాలనీ ఫిదా డైరెక్టర్ ఫిక్సయినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఏషియన్ సునీల్ చాలా కాలంగా నిర్మాతగా మారాలని అనుకుంటున్నారు. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. మంచి కథ కుదరడంతో నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే సినిమాలో హీరోగా మళ్లీ కొత్త వ్యక్తినే తీసుకున్నాడట శేఖర్ కమ్ముల. ఆడిషన్స్ నిర్వహించి అందులో ఫైనల్ గా అయిదుగురిని తీసుకొని, ఒకరిని సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారు.