బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టికి ఘోర అవమానం జరిగింది. శిల్పా శెట్టిపై జాతీవివక్ష చూపించింది ఆస్ట్రేలియా దేశం. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా శెట్టియే తన సోషల్ మీడియా ద్వరా తెలిపింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే….ఆదివారం శిల్పా శెట్టి సిడ్నీ నుంచి మెల్బోర్న్కు వెళ్తున్నారు. ఈ సమయంలో సిడ్నీ విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్లో ఉన్న ఉద్యోగిని తన వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఒకటి అతిపెద్దగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. అంతేకాక ఆ బ్యాగ్ను ‘ఓవర్సైజ్ లగేజ్’ కౌంటర్ వద్దకు వెళ్లి చెక్ చేయించమని చెప్పిందన్నారు.
లేదని.. కావాలంటే బ్యాగ్ను స్కానర్ ద్వారా కాకుండా మ్యానువల్గా చెక్ చేయమని కోరినట్లు తెలిపారు. కాని తనను ఎవరు పెద్దగా పట్టించుకోలేదని , ఈ వ్యవహారం అంతా తనను ఎంతో బాధపెట్టిందని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. శరీర రంగును బట్టి ఎదుటివారితో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుందా..! అంటూ నటి శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరీర రంగు వల్ల విమానాశ్రయంలో తనకు ఎదురైన జాతీవివక్ష అనుభవాన్ని శిల్పా శెట్టి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.