శ్రుతిహాసన్.. కెరీర్ స్టార్టింగ్ లో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్నా గబ్బర్ సింగ్ సినిమాతో గోల్డెన్ లెగ్ గా మారి స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది. గతంలో ఆమె బొమ్మరిల్లు సిద్దార్దతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత క్రికెటర్ రైనాతో ప్రేమలో ఉందని పుకార్లు వచ్చాయి.
కానీ, ఇప్పుడు శృతి.. మైఖేల్ కసలే అనే బ్రిటన్ నటుడితో గత 3 నెలలుగా ప్రేమాయణం సాగిస్తోందని సమాచారం. శృతి ఓ సాంగ్ రికార్డు చేయటం కోసం లండన్ వెళ్లిన సమయంలో మైఖేల్ పరిచయం అయ్యాడని, తరువాత వారి పరిచయం ప్రేమగా మారి డేటింగ్ చేస్తున్నారని సమాచారం. కాగా శృతి, మైఖేల్ కలిసి 2 రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఒకే రకమైన గాగుల్స్, ఒకేరకమైన స్లిప్పర్స్ ధరించి కాసేపు హడావుడి చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా గత వారం మైఖేల్ ఇండియాకి వచ్చాడని, వాలెంటైన్స్ డే రోజు కొంత సమయం శృతితో గడిపినట్టు తెలుస్తోంది. మరి శ్రుతి తన ప్రేమాయణం గురించి ఇప్పటికైనా చెబుతుందో లేదో చూడాలి.
{youtube}v=Z-AhhATAwGE{/youtube}
Related