Thursday, April 25, 2024
- Advertisement -

నేను సామాన్యుడిగానే ఉంటా.. ప్రధాని పదవి వొద్దు..!

- Advertisement -

గత ఏడాది కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎంతో మంది పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలు రోడ్లపైన కన్నుమూసిన దుస్థితి ఏర్పడింది. అలాంటి కష్టసమయంలో ఆపద్భాందవుడిగా ప్రత్యక్షమయ్యారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. స్వతహాగా విలన్ వేషాలు వేసే సోనూ సూద్ ఇప్పుడు దేశ ప్రజలు ఆరాధ్య దైవం. ఆపదలో ఉన్నామన్న ఒక్క ట్వీట్‌ చాలు.. క్షణాల్లోనే స్పందిస్తాడు.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కూడా ఎంతో మందికి తన సేవలు అందిస్తున్నాడు సోనూసూద్. అందుకే ఇప్పుడు దేశ ప్రజలు ప్రభుత్వాన్ని మాని సోనూ సూద్ వైపు చూస్తున్నారు. అతడి దయార్థ్ర హృదయానికి దేశం మొత్తం చేతులెక్కి మొక్కుతోంది. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఆమె వ్యాఖ్యలపై తాజాగా సోనూ స్పందించాడు. నేను సాధారణ వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడతా అని కుండబద్దలుగొట్టాడు. అంతే కాదు ప్రస్తుతం నా సోదరులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందులోకి వెళ్లి నేనేం చేస్తారు. అది నా పని కాదు అని తేల్చి చెప్పాడు. కొన్ని రోజుల క్రితం కమెడియన్ వీర్ దాస్ కూడా 2024లో సోనూ సూద్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ప్రచారానికి ట్విట్టర్‌లో వేలాది గొంతులు తోడయ్యాయి.

టాలీవుడ్ లో విషాదం.. ముగ్గురు ప్రముఖులు మరణం!

తండ్రి శాసిస్తాడు- త‌న‌యుడు పాటిస్తాడు!

ఎన్టీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి : చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -