ఇటీవల టాలీవుడ్ లో వరుసగా సెలబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. కరోనాతో మరికొంత మంది సెలబ్రెటీలు కన్నుమూశారు. ఈ మద్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. అల్లు అర్జున్ సైతం కూడా కరోనా నుంచి బయట పడ్డట్టు ట్వీట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ హోం క్వారంటైన్లో ఉన్నాడు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు.
ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైల్లో ఉన్నారు. ఎన్టీఆర్తో ఈ రోజు ఫోన్లో సంభాషించానని, ఆయన ఆరోగ్యంగా సూపర్గా ఉందని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఆరోగ్యంపై అప్డేట్ను పంచుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి.
‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ home quarantine లో ఉన్నారు. He and his family members are doing good. తను చాలా ఉత్సాహంగా, energetic గా ఉన్నారని తెలుసుకుని I felt very happy. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. God bless @tarak9999’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్టర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలు కరోనాతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
వ్యాక్సిన్ తీసుకున్న సెలబ్రిటీలు ఓవరాక్షన్ ఆపండి.. హీరోయిన్ సెటైర్!
ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న.. మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు : అల్లు అర్జున్