సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా రోబో 2.0. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివాజీ, రోబో సినిమాలు సూపర్ హిట్స్ సాధించాయి.
అందుకే ఈ చిత్రంపై అన్ని అంచనాలు. రోబోని రజనీ ఒంటి చేత్తో నడిపిస్తే 2.0 లో మాత్రం మరో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించనున్నారు. వారిలో ఎక్కువ సేపు సినిమాలో విలనిజంతో ఆకట్టుకోనున్న హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ యాక్షన్ హీరో అయినప్పటికి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.
ఇంకా ఈ చిత్రంలో రెండు కీలక పాత్రల్లో విశ్వనటుడు కమలహాసన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారట. వీరిద్దరు రోల్స్ డైరెక్టర్ శంకర్ ఎంతో సీక్రెట్ గా ఉంచారు. ఇప్పటికే కమల్ కి సంబంధించిన సీన్స్ కంప్లీట్ అయ్యినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్లను త్వరలోనే తెరకెక్కించున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్ చెన్నై కి వెళ్లనున్నట్లు తెలిసింది. క్లైమాక్స్ లో వచ్చే ఎన్టీఆర్ రోల్ సినిమాకు మరింత హైప్ తెస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలను కలిపి చేసి శంకర్ రోబో 2.0 కు పెద్ద మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. దీంతో సౌత్, నార్త్ లో ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Related