Thursday, April 25, 2024
- Advertisement -

టాలీవుడ్ లో విషాదం: కరోనాతో దర్శకుడు మృతి!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగితే అదే తన వంతు సామాజిక సేవగా భావించవచ్చు. కరోనా మహమ్మారిని ఎదిరించడానికి భౌతిక దూరం, మాస్క్లే మనకు శ్రీరామరక్ష. ఈ మహమ్మారి ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. అలాగే ఎందరో సెలబ్రిటీల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ను కరోనా బలి తీసుకుంది.

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు కుమార్ వట్టి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన ఇతను మొదట పరుశురాం వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు తరువాత సోలో సినిమాకు కూడా అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ సందర్భంలోనే శ్రీ విష్ణుతో పరిచయం జరగడం, తాను దర్శకుడిగా మారితే తన హీరో కచ్చితంగా శ్రీ విష్ణు అని అప్పుడే ఫిక్స్ అయ్యారట కుమార్ వట్టి. అలా మొత్తానికి మా అబ్బాయి సినిమాతో కుమార్ వట్టి దర్శకుడిగా మారారు.

Also read:ఇంట్లో ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన నటి ప్రగతి.. వీడియో వైరల్!

ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని కలలు కన్న దర్శకుడు కుమార్ వట్టి కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. జీవితంలో తాను అనుకున్నది సాధించిన కుమార్ వట్టి కరోనా కాటుకు బలి కావడం పలువురిని కలిచి వేస్తోంది .ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Also read:ఈ చెత్త రాజకీయాలు ఇలాగే ఉంటాయి.. సైలెంట్ గా చేసే వాళ్లే హీరోలు.. పూనమ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -