- Advertisement -
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని, తాను కూడా బాధితురాలినేనంటూ పోరాటం సాగిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. అయితే తాజాగా అభిరామ్ లాంటి వ్యక్తుల్ని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలని తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది
రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయని తక్షణం వాళ్ల నుంచి విముక్తి కలిగించాలని పేర్కొంది. అమ్మాయిల ఫీలింగ్స్ తో ఆడుకొనే ఎవడిని వదిలేది లేదని, ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్న బయపడాలని.. తాను చేస్తున్న ఉద్యమానికి మరకలు అంటించేవాళ్లకి ఇదే నా సవాల్ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
https://www.facebook.com/iamsrireddy/posts/2091800267733561