టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి తన వాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచింది.అవకాశాల కోసం అమ్మాయిలను వాడుకుంటున్నారని సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నటులపై ఆధారాలు లేకుండా విమర్శలు చేయడంతో శ్రీరెడ్డిని ఎవరు పట్టించుకోవడం లేదు.దీంతో ఆమె తమిళ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని అక్కడి నటులనే కాక దర్శకులపై కూడా సంచలన కామెంట్స్ చేస్తుంది.విశాల్ నుండి తనకు ప్రాణ హాని ఉందని తెలిపి సంచలనానికి తెర లేపింది.ర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో హీరోయిన్లను ఎలా వాడుకుంటారనే విషయంపై సంచనల కామెంట్స్ చేసింది.
నటులు, దర్శకనిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ అని చెప్పి బయటకు తీసుకువెళ్లి కారులోనే పని కానిస్తున్నారని.. కారునే పడకగదిగా మారుస్తున్నారని విమర్శలు చేసింది. విదేశాల్లో షూటింగ్ అని చెప్పి అక్కడ చేసే నిర్వాహకం కూడా ఇదేనంటూ చెప్పింది. తమ కోరికను తీర్చుకోవడం కోసం మేకప్ మ్యాన్ నుండి దర్శకనిర్మాతల వరకు అందరూ హీరోయిన్లను వాడుకుంటున్నారని తెలిపింది.తమిళ మీడియాకు శ్రీరెడ్డి వరస పెట్టి ఇంటర్య్వూలు ఇవ్వడం మొదలు పెట్టింది.దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఆమెపై యాక్షన్కు రెడీ అవుతుంది.