- మల్టీస్టారర్ సినిమాకు రాజమౌళి ప్లాన్
ఒక సినిమా తీయాలంటే దానికి ముందు ఎన్నో పనులు ఉంటాయి. వాటన్నింటిని పూర్తిచేసి చివరికి సినిమాను అధికారికంగా ప్రకటించే సంప్రదాయం ఎస్.ఎస్.రాజమౌళిది. ఆయన ఒక సినిమా తీయాలంటే కథ రాసేప్పుడే ఏమేం కావాలి.. ఏ యే పనులు చేయాలని ఓ అంచనాకు వచ్చేస్తాడు. ఆ విధంగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. అందుకే బాహుబలికి ఐదేళ్లు పట్టింది. అదే వేరొళ్లకయితే ఎన్ని సంవత్సరాలు పట్టేదో. పైగా రాజమౌళి మొత్తం తన టీమ్తోనే అన్నీ పనులు అయ్యేలా చూసుకుంటారు. ప్రస్తుతం చెర్రీ, తారక్తో ఓ భారీ సినిమా తీస్తున్నారని అధికారికంగా ప్రకటించకున్నా అదే ఫైనల్.
ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలకు టెస్ట్ షూట్ చేస్తాడంట. ఎవ్వరినైనా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని జక్కన్న చూస్తాడు. తనకు తగినట్లుగా నటీనటులను మలచుకుంటాడు.
ప్రస్తుతం చెర్రీ, తారక్లను టెస్ట్ షూట్ చేయడానికి తన రెండ్ టీమ్లను రాజమౌళి పంపించాడట. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్రప్రసాద్తో కలిసి కథా చర్చలు కొనసాగిస్తున్న రాజమౌళి పనిలో పనిగా రెండు టీమ్స్ ను ముందే రెడీ చేసుకున్నాడు. ఒక టీమ్ మొత్తం రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ ని మరొక టీమ్ ఎన్టీఆర్ సీన్స్ ని టెస్ట్ షూట్ చేయనుందట. ఆ తర్వాత రెండు టీమ్ చేసిన సీన్స్ ను పరిశీలించి తాను ఒక క్లారిటీకి రానున్నాడట జక్కన్న. మల్టీస్టారర్ అంటే కష్టమైన పని. ఇద్దరు హీరోలను సమానంగా చూపించాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంది. అందుకే ప్రత్యేక శ్రద్ధతో రాజమౌళి సినిమా పనులు చేస్తున్నారు.