- Advertisement -
సమ్మోహనం హిట్తో మంచి జోష్లో ఉన్నాడు సుధీర్ బాబు.ఈ మధ్య సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు కూడా ,ప్రస్తుతం ఆయన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు.నాభా నటేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ మంచి మార్కులను కొట్టేసింది.
తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను, ‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుధీర్ బాబు సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమా సుధీర్ బాబుకి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.