నాగార్జున-నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటించనున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది.మరోపక్క నానికి జోడీగా రష్మికా మంధాన కనిపించనున్నట్లు సమాచారం ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబుతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఓ పాటను కూడా చిత్రీకరించారు.ఆకాంక్ష ‘మళ్లీరావా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయం అయ్యారు. సుమంత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత ఏడాది చివర్లో విడుదలై, మంచి టాక్ అందుకుంది.ఈ సినిమా తరువాత తెలుగులో నాగ్ పక్కనే హీరోయిన్గా చాన్స్ కొట్టేసింది.