- Advertisement -
సుప్రీం మూవీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో హీరో సాయిధరమ్ తేజ, హీరోయిన్ రాఖీ ఖన్నా, నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు వీరికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం మీడియాతో హీరో సాయి ధరమ్ తేజ, దిల్ రాజు మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షాల వల్లే సినిమా సూపర్ హిట్ అయ్యిందని, అందుకే స్వామి వారి దర్శనం చేసుకుందుకు వచ్చామని చెప్పారు.