Saturday, May 11, 2024
- Advertisement -

అబ్బో.. స్వాతి రెడ్డి సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్!

- Advertisement -

కలర్స్ స్వాతి అలియస్ స్వాతిరెడ్డి..  ఈ తెలుగమ్మాయికి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే అక్కడ ప్రముఖ నటిగా చెలామణి అవుతోంది. తెలుగులో మంచి మంచి ఆఫర్లు రావడం లేదు కానీ.. గుర్తింపుకు అయితే లోటు లేదు.

ఇలాంటి నేపథ్యంలో స్వాతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ద్విభాష సినిమా ‘త్రిపుర’. ఈ హారర్ సినిమాను తెలుగు, తమిళ భాషల కోసం రూపొందుతోంది.

‘గీతాంజలి’ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. గీతాంజలి పర్వాలేదనిపించుకొన్న సినిమా కావడంతో ‘త్రిపుర’ పై పాజిటివ్ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా పై ఒక హిందీ ప్రొడ్యూసర్ కన్నేశాడని వార్తలు  రావడం. ఈ హారర్ సినిమా రీమేక్ రైట్స్ ను కొనడానికి  హిందీ వాళ్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట.

అయితే అధికారిక ధ్రువీకరణ లేదు కానీ.. ఈ సినిమా రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి రీమేక్  లో కూడా స్వాతికే ఛాన్స్ దక్కితే.. అది ఈ భామకు ప్లస్ పాయింటే అవుతుంది కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -