దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్దులపై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. మద్యానికి బానిస అయినవారు.. సెల్ ఫోన్ లో ఫోర్న్ వీడియోలు చూసేవారు ఇలాంటి అత్యాచారాలకు తెగబడుతున్నారు. దారుణం ఏంటంటే మైనర్లు కూడా ఇలాంటి దారుణాలకు వడికడుతున్నారు. నిర్భయ, దిశ చట్టాలు తీసుకు వచ్చినా కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.
తాజాగా త్రిపురలో ఇద్దరు చిన్నారులపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు తమ ఇద్దరి స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్పై బయటకు వెళ్లారు. వారు వెళ్లే సమయంలో మరో ఆరుగురు యువకులు కలిసి బాలికలను అడవిలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆ ఇద్దరు బాలికలు ఆపస్మారక స్థితిలోకి వెళ్లగానే భయపడి అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు.
బాలికలు ఎంతకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరూ కలిసి చుట్టుపక్కల వేతికారు.. అడవిలో అపస్మారకస్థితిలో ఉన్న బాలికలు కనిపించారు. పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ లో కేవలం వారికే కరోనా..!