నిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది నుంచి కరోనా వైరస్ ప్రబలి పోయిన నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు కన్నుమూసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు పలువురు కన్నుమూశారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హాస్య నటుడిగా పేరు తెచ్చుకుంటున్న గణేశన్ కన్నుమూశారు.
ఇండస్ట్రీలో కార్తి అని కూడా పిలుస్తుంటారు. తేపట్టి గణేశన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అజిత్ లాంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించాడు. తెలుగులో డబ్ అయిన రేణిగుంట సినిమాలో ప్రధాన కమెడియన్గా నటించాడు. గణేశన్కు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ని మధురైలోని రాజాజీ హాస్పిటల్లో చేర్పించారు.
అక్కడే కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు.. కానీ ఉన్నట్టుండి ఆరోగ్యం విషమించ డంతో మార్చి 22న ఈయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యానికి తోడు గుండెపోటు రావడంతో గణేశన్ మరణించినట్లు తెలుస్తుంది.
‘జెర్సీ’ఉత్తమ తెలుగు చిత్రం.. ఉత్తమ వినోదాత్మక చిత్రం ‘మహర్షి’!