Saturday, April 20, 2024
- Advertisement -

కరోనాతో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

- Advertisement -

ఈ మద్య కరోనాతో ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ లో ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూసిన విషయం మరువక ముందే మరో హాస్యనటుడు కరోనాతో కన్నుమూశారు. తమిళ సినీ హాస్యనటుడు పాండు (74)కరోనా కాటుకు బలయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్నిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. మరో విషాదం ఏంటంటే పాండు సతీమణికి కూడా కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. హాస్యనటుడు పాండు కేవలం తన నటనతోనే కాదు మంచి డిజైర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తును డిజైన్ చేసింది పాండునే. దాంతోపాటు తమిళనాడు టూరిజం లోగోను కూడా ఆయనే రూపొందించారు. పాండు సోదరుడు సెల్వరాజ్ కూడా నటుడే. ఇప్పటితరం హీరోలతోనూ ఆయన పలు చిత్రాల్లో కనిపించారు. ఆయన మృతి తమిళ ఇండస్ట్రీ సంతాపాన్ని ప్రకటించింది.

కరోనా పై పోరాటం.. ఆర్ఆర్ఆర్ టీమ్ వినూత్న ప్రచారం!

భర్తను తలుచుకుంటూ బోరున ఏడ్చిన సురేఖావాణి.. ఎందుకంటే?

కరోనా కాటుకు బాలీవుడ్ నటి బలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -