బిగ్బాస్ తెలుగు రెండవ సీజన్ భారీ అంచనాల మధ్య మొదలైంది.యాంకర్ నాని మొదటి నుండి చెప్పినట్లుగానే షోలో మరింత మసాలా షూరు చేశారు.బిగ్బాస్లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.సంజనా,నూతన నాయుడు,కిరీటి షో నుండి బయటికి వచ్చేశారు.అయితే ఈ వారంలో షోలో ఓ సంఘటన చోటు చేసుకుంది.షో మొదటి నుండి కలిసి ఉన్న తనీష్,తేజస్వి మధ్య గొడవ జరిగింది.
అక్కడ మాటలు ఇక్కడ,ఇక్కడ మాటలు అక్కడ చెప్పి వారి మధ్య గొడవలు పెడుతుంది తేజస్వి.భానుని నందిని ఏదో అందని వారి మధ్య గొడవలు పెట్టింది తేజస్వి.తరువాత నందిని వెళ్లి భానుకి క్షమించమని కోరింది.తరువాత వీరిద్దరు కలిసిపోయారు.ఇది జీర్ణించుకోలేని తేజస్వి,నందిని తనీష్ ను కూడా ఏవో మాటలు అందని చెప్పి మళ్లీ వారిద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేసింది.దీంతో నందిని చాలా బాధపడింది.ఇదంతా గమనించిన తనీష్కు తేజస్వి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చింది.
అదే విషయాన్ని సామ్రాట్ తో చర్చించాడు. ఈ విషయం తేజస్వికి తెలిసి తనీష్ పై కూడా విరుచుకుపడింది.తేజస్వి ప్రవర్తన హోస్మెట్స్కే కాదు చూసే ఆడియన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు. మరి దీనిపై నాని ఎలా స్పందిస్తాడో చూడాలి.ఒక ఈ వారం ఎవరు ఎలిమినేషన్లో తనీష్,అమిత్,సామ్రాట్ తప్ప అందరు ఎలిమినేట్ అయ్యారు.