ఈ మధ్య.. కన్నడ సినిమా కిరికి పార్టీతో.. ఒక్కసారిగా స్టార్ఇమేజ్ తెచ్చుకొని.. తెలుగు దర్శకులు, హీరోల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ రష్మిక మంధన. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు తెలుగు, తమిళం నుంచి వస్తున్న ఆఫర్స్ ని సున్నితంగా తీరస్కరిస్తునట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం.. ఈ భామ త్వరలో పెళ్లి చేసుకోబుతుంది.
{loadmodule mod_custom,GA1}
అది కూడా ప్రేమిచిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కిరికి పార్టీలో తనతో పాటు హీరోగా నటించి.. సినిమాకి దర్శకత్వం వహించిన రక్షిత్ శెట్టితో అమె ప్రేమలో పడినట్లు సమాచారం. రక్షిత్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా అతనికి విషేష్ చెబుతూ, ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న విషయం కూడా కన్ఫర్మ్ చేసేసింది. దీంతో పాటు త్వరలో సినిమా కపుల్స్ ఇద్దరు రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. జులై 3న వీళ్ళ నిశ్చితార్ధం జరగనుందని తరువాత పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది.
{loadmodule mod_custom,GA2}
ఇంతకాలం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ వచ్చిన వీరిద్దరు.. ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా ఓపెన్ అయిపోయారు. దీంతో ఇంతకాలం రష్మికను టాలీవుడ్ హీరోయిన్ గా చూద్దామని ఆశపడ్డ అందరికి ఊహించని విధంగా నిరాశ మిగిల్చినదని అందరు అనుకుంటున్నారు.
{youtube}0Q5uSZ2dZsw{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related