Wednesday, May 1, 2024
- Advertisement -

మెగా స్టార్ మేనల్లుడ్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు

- Advertisement -

ఈ శుక్రావారం బాబు బంగారం సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా తరవాత రోజునే తిక్క సినిమా కూడా విడుదల అవుతున్నాయి. బాబు బంగారానికి వెంకటేష్ – మారుతి మెయిన్ గా ఆకర్షణ అయ్యారు. కానీ తిక్కకి సాయి ధరం తేజ అన్నీ తానే అయ్యి ఒస్తున్నాడు. పెద్దగా హైప్ లేని సినిమాని బాబు బంగారం తరవాత రోజునే విడుదల చెయ్యాల్సిన పనేంటి అని అందరూ అంటున్నారు.

బాబు బంగారం సినిమా మీద అందరి దృష్టీ గట్టిగానే ఉంది. ఇప్పటికే బుకింగ్ లు కూడా జోరుగా సాగుతున్నాయి. కానీ తిక్క సినిమా గురించి జనం ఎక్కడా మాట్లాడుకోవడం లేదు. బుకింగ్ లు డల్ గా సాగుతున్నాయి. బాబు బంగారం కి పోటీగా తిక్క రావాడం సాయి కి ఒకరకంగా నెగెటివ్ అనే చెప్పాలి.

‘ఓం త్రీడీ’ లాంటి డిజాస్టర్ తో దర్శకుడిగా పరిచయమైన సునీల్ రెడ్డి ఈ సినిమాను రూపొందించడం.. హీరోయిన్లు పేరున్న వాళ్లు కాకపోవడం లాంటి ప్రతికూలతల వల్ల ‘తిక్క’కు అనుకున్నంత హైప్ రాలేదని అర్థమవుతోంది. ఐతే ఈ సినిమా కంటెంట్ విషయంలో సాయిధరమ్ తో పాటు దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారు. విడుదలకు ముందు పరిస్థితి ఎలా ఉన్నా.. టాక్ బాగుంటే అంతా సర్దుకుంటుందన్నది ఆశ. మరి ‘తిక్క’ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూద్దాం.

Related

  1. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  2. సాయి కుమార్ కొడుకు భయ పడుతున్నాడు
  3. రాజేంద్ర ప్రసాద్ – సాయి ధరం తేజ మధ్య సీన్ లు కేక
  4. నట్టేట మునిగిన సాయి కుమార్ .. పాపం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -