చాలా గ్యాప్ తర్వాత త్వరలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. కరోనా ఫస్ట్వేవ్ అనంతరం థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలానికి తెరుచుకున్నాయి. అప్పటికే థియేటర్ యజమానులకు చాలా నష్టం వచ్చింది. ఇక ఫస్ట్వేవ్ అనంతరం విడుదలైన సోలో బతుకే సో బెటర్, క్రాక్, వకీల్సాబ్ వంటి చిత్రాలు భారీ కలెక్షన్లు రాబట్టాయి. మళ్లీ థియేటర్లు కుదరుకుంటున్నాయి.. అనే టైంలో సెకండ్వేవ్ వచ్చి పడింది. ఈ సారి ఇక థియేటర్లు కోలుకులేని దెబ్బ తిన్నాయి.
ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేదు. కరోనాతో తాము ఎంతో నష్టపోయామని.. కనీసం విద్యుత్ బకాయిలు అన్నా మాఫీ చేసి తమను ఆదుకోవాలంటూ థియేటర్ యజమానాలు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు ఓటీటీలు థియేటర్ల పాలిట గుదిబండగా మారాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేకొనే వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ థియేటర్లు ఓపెన్ చేసేందుకు యజమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
మరోవైపు పెద్ద సినిమాలు సైతం ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇదిలా ఉంటే సుధీర్ఘ గ్యాప్ అనంతరం త్వరలో కొన్ని సినిమాలు థియేటర్ల ముందుకు రాబోతున్నాయి. సత్యదేవ్ నటించిన తిమ్మరసు, తేజ సజ్జ నటించిన ఇష్క్ మూవీ ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. వీటికి వచ్చే స్పందనను బట్టి కొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. జూలై 30 నుంచి థియేటర్లు తెరుచుకుంటుడంతో ప్రేక్షకులు ఏ మేరకు వస్తారో అన్న భయం కూడా ఉంది.
ఓటీటీలో ఈ వారం సినిమాలు ఇవే..
ఆహా వేదికగా మమ్మట్టి హీరోగా నటించిన వన్ జూలై 30 న విడుదల కాబోతున్నది. ఇక బాలీవుడ్ నుంచి లైన్స్ సినిమా వూట్ ఓటీటీ నుంచి జూలై 29న మిమి సినిమా నెట్ప్లిక్స్ నుంచి జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
Also Read
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ సాంగ్ లో రానా, ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణ..!