టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్గా, పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్ టెక్నీషియన్ కె.రంగారావు మృతి అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి . 1957 మే 5న జన్మించిన ఆయన ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు.
ఇంద్రధనుస్సు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన చివరిగా బోయపాటి డైరెక్ట్ చేసిన ‘జయ జానకి నాయక’ సినిమాకి దర్శకత్వశాఖలో పని చేశారు. దర్శకుల సంఘంలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్మయక్రియలు నిర్వహించనున్నారు.