Friday, May 17, 2024
- Advertisement -

విచారణలో పూరి జగన్నాథ్ చెప్పిన కొన్ని నిజాలు

- Advertisement -

డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పూరీ.. పదిహేడేళ్ల కిందట సినీ పరిశ్రమకు వచ్చానని, ఇదే ప్రపంచమని.. సినిమాల కోసమే తన యూనిట్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లొస్తానని విచారణలో పూరి వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, స్నేహితులు చాలా తక్కువ అని.. తన సినిమాల్లో ప్రస్తుతం ఉన్న కల్చర్ ని చూపెట్టే ప్రయత్నం చేస్తానని విచారణాధికారులతో పూరీ తెలిపినట్లు సమాచారం. బుధవారం ప్రారంభించిన అధికారుల బృందం పూరిని ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది.

అయితే పూరి మాత్రం ఏ మాత్రం తడబడకుండా సూటిగా స్పష్టంగా జవాబులు ఇచ్చారు. కెల్విన్ తో సంబంధాలపై అధికారులు అడిగిన ప్రశ్నకు పూరీ సూటిగానే సమాధానం ఇచ్చాడట. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్ లో కెల్విన్ ను కలిసిన విషయం నిజమేనని ఒప్పుకున్న పూరి.. ఆ తర్వాత మాత్రం కెల్విన్‌తో రెగ్యులర్‌గా ఎలాంటి సంభాషణలు జరగలేదని తెలిపినట్లు సమాచారం. సిట్ ఇంచార్జి శ్రీనివాసరావు నేతృత్యంలో సాగుతున్న విచారణను ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్, చంద్రవదన పర్యవేక్షిస్తున్నారు. పూరీని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మరో అధికారి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -