కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు నిర్మిస్తున్న దర్శకుడు దిల్ రాజు. పంపిణీదారుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు విజయవంతమైన దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. 2017 సంవత్సరంలో ఏకంగా ఆరు హిట్ సినిమాలు నిర్మించిన వ్యక్తిగా దిల్రాజు రికార్డు సాధించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ విజయాలకు చిరునామాగా మారింది.
తొలి సినిమాఫీల్గుడ్ సినిమాలు తీస్తూ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా దిల్రాజు రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ఆరు సినిమాలను నిర్మించారు. ఈ ఆరు చిత్రాలు విజయాల బాట పట్టాయి. 2017లో సంక్రాంతికి విడుదలైన ‘శతమానం భవతి’ తొలి విజయం రాగా నానితో ‘నేనులోకల్’, వరుణ్తేజ్, సాయిపల్లవితో ‘ఫిదా’, అల్లు అర్జున్తో ‘దువ్వాడ జగన్నాథమ్’, రవితేజతో ‘రాజా ది గ్రేట్’, మళ్లీ నానితో ‘ఎంసీఏ’ సినిమాలు నిర్మించాడు. ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొంది విజయాలు అందుకున్నాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టాయి. ‘శతమానం భవతి’ సినిమా ఏకంగా జాతీయ అవార్డు లభించడం విశేషం. ఈ సందర్భంగా ఆరు హిట్లు అందుకోవడంతో 2017 సంవత్సరానికి ఘనంగా ముగింపు పలకాలని క్రిస్మస్ సందర్భంగా ఓ గ్రాండ్ వేడుక నిర్వహించనున్నాడు.
దిల్రాజు సంస్థ డిసెంబర్ 25న రాత్రి ఏడు గంటలకు ఓ వేడుక నిర్వహించనున్నాడు. ఈ కార్యక్రమానికి ఐదు చిత్రాల్లో నటించిన నటీనటులు, యూనిట్ సభ్యులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది.
‘మా నిర్మాణ సంస్థకు 2017 చిరస్మరణీయమైన ఏడాదిగా నిలిచింది. 2017 వేడుకను డిసెంబరు 25న నిర్వహిస్తున్నాం’ అని ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం దిల్రాజు బ్యానర్లో ‘శ్రీనివాస కల్యాణం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ‘లవర్’ అనే మరో సినిమా కూడా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అయితే 2017లోనే దిల్ రాజు జీవితంలో విషాదం మిగిల్చింది. తన భార్య అనిత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మొత్తం నిర్మించిన సినిమాలు 7. ఒక సినిమా జవాన్ పరాజయం పొందింది.