గత వారంలో విడుదల అయిన భలే భలే మగాడివోయ్, డైనమేట్ , జయసూర్యలు థియేటర్ల సంఖ్య విషయంలో భారీ స్థాయిలోనే రిలీజయ్యాయి.
వీటి ప్రభావం మూడు సినిమాల మీద పడింది. యాభై రోజులను పూర్తి చేసుకొన్న బాహుబలి సినిమా మీద, నాలుగు వారాలను పూర్తి చేసుకొన్న మహేశ్ బాబు సినిమా మీద ఈ సినిమాలు ప్రభావం చూపాయి. ఈ మూడు సినిమాలు విడుదల అయ్యే సరికి.. శ్రీమంతుడు, బాహుబలి థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇక ఈ సినిమాల విడుదలతో కిక్-2 సినిమాపై తీవ్ర ప్రభావం పడింది.
నెగిటివ్ టాక్ ను ఎదుర్కొన్న కిక్ -2 ఈ కొత్త సినిమాల ధాటికి తట్టుకోలేకపోయింది. ఇక బాహుబలి కలెక్షన్లు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. అన్ని భాషల్లోనూ కలిపి దాదాపు 560 కోట్ల రూపాయల స్థాయి కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. ఇక మరోవైపు మహేశ్ బాబు స్టామినా మాత్రం తగ్గలేదు. వీకెండ్ లో ఈ సినిమా బాగానే ఆడుతోతంది. ప్రధానంగా మల్టీ ప్లెక్స్ లలో ఈ సినిమా ఆడుతున్న హాళ్లు నిండుతున్నాయి. ఇది మహేశ్ స్టామినాకు నిదర్శనంగా మారింది.
ఇప్పటి వరకూ ఈ సినిమా దాదాపుగా 160 కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను సాధించినట్టు సమాచారం. భలేభలేమగాడివోయ్, డైనమేట్ వంటి సినిమాలు కూడా ‘శ్రీముంతుడు’ను మరీ అంతగా ప్రభావితం చేయలేకపోతున్నాయి. ఇక విశాల్ ‘జయసూర్య’ తమిళంలో కాదు కానీ.. తెలుగు మాత్రం అంతగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతోంది.