ఇప్పటికి తరగని అందాలతో గిలిగింతులు పెడుతోంది అతిలోక సుందరి శ్రీదేవి. రీసెంట్ గా ఆమె నటించిన మామ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మూవీ కోసం ఎంత కష్టపడ్డా.. సినిమా ప్రమోషన్ విషయంలో మాత్రం శ్రద్ధను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో… మామ్ సినిమా ప్రమోషన్ కోసం శ్రీదేవి తెగ కష్టపడిపోతోంది.
{loadmodule mod_custom,GA1}
అదే పనిగా మీడియాకు తన సినిమాకి సంబంధించిన విషయాలను చెబుతోంది. అయితే.. శ్రీ దేవి ఊహించని రీతిలో ఆమెను రెండు అంశాలు ఇబ్బంది పెట్టటమే కాదు.. ఇరిటేట్ చేస్తున్నాయి. శ్రీదేవి ఎక్కడికి వెళ్లినా.. ఆమె నటించిన మామ్ సినిమా గురించి ప్రశ్నలు వేయకుండా.. బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఎందుకు చేయలేదన్న ప్రశ్న.. కూతుళ్లకు సంబంధించిన ప్రశ్నలు వేయటంపై అతిలోక సుందరికి కోపం వచ్చేస్తోంది. రీసెంట్ గా.. మామ్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ముంబయిలో జరిగింది. దీనికి కూతుళ్లతో కలిసి ఆమె హాజరయ్యారు. ఫోటోగ్రాఫర్లు శ్రీదేవిని వదిలేసి.. కూతుళ్ల ఫోటోలు తీయటం.. మీడియా ప్రతినిధులు.. మామ్ మూవీ గురించి వదిలేసి.. కూతుళ్ల ఎంట్రీకి సంబంధించిన ప్రశ్నలు వేయటం.. ఆమెకు ఒళ్లు మండేలా చేసింది.
{loadmodule mod_custom,GA2}
మీడియాను కలుస్తునది కూతుళ్ల గురించి చెప్పేందుకు కాదని.. మామ్ సినిమా కోసమంటూ.. చెబుతోంది. తాను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు వేయాలని కోరింది. శ్రీదేవి యవ్వారం చూస్తుంటే.. మీడియా ఏమేం ప్రశ్నలు వేయాలన్నది కూడా ఆమె డిసైడ్ చేసేటట్టు ఉన్నారే. మరి.. మామ్ ప్రచారం కోసం వచ్చినప్పుడు ఈ మామ్ రాకుండా.. కూతుళ్లను ఎందుకు వెంటబెట్టుకొని వచ్చినట్లో? అంటూ మీడియా వాళ్లకు వచ్చిన డౌట్ వింటే అతిలోక సుందరికి ఎంత కాలిపోతుందో?
{youtube}mHSEXdUcUKk{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related