Friday, April 26, 2024
- Advertisement -

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం!

- Advertisement -

దేశంలో కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే.. కామాంధులు మాత్రం ఎక్కడ బడితే అక్కడ రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా లెక్క చేయకుండ రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి బీచ్ కి వెళ్లిన ఓ యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేయడమే కాకుండా నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పపడ్డారు.

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి రెండు వారాల క్రితం అల్లవరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తన స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం ఒడ్డుకు వెళ్లింది. అక్కడే మద్యం మత్తులో ముగ్గురు యువకుల కన్ను ఈ జంటపై పడింది. ఈ ముగ్గురూ వారిని సమీపించి యువకుడిపై దాడిచేసి బంధించారు.

తర్వాత యువతిపై సామూహిక అత్యాచారం చేసి తర్వాత నగ్నంగా ఫోటోలు తీశారు. పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు యువతికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేదంటే తన వద్ద వున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. వాళ్ల బెదిరింపులు తట్టుకోలేక యువతి కుటుంబ సభ్యులు తన పరిస్థితి చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

కూకట్​పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు…

గాంధీ హాస్పిటల్‌లో మహా అద్భుతం.. ఎంటో తెలిస్తే ఔరా అంటారు..!

తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -