తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ హీట్ను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నిది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై దాడి జరిగింది. కమల్ కారుపై దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని సంబంధించి మక్కల్ నిది మయం నాయకుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎజి.మౌర్య ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కాంచీపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కమల్ హాసన్ హోటల్ వైపు వెలుతుండగా ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే కమల్ కారుపై దాడి చేయడంలో కారు విండో గ్లాస్ పగిలిపోయింది. ఆ సమయంలో దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. అయితే, ఈ ఘటనలో కమల్ హాసన్ కు ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న మక్కల్ నిది మయం కార్యకర్తలు కమల్ కారుపై దాడి చేసిన వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి అదుపులోకి తీసుకుని, తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. కమల్ కలుసుకోవడానికి ఆ వ్యక్తి ఈ విధంగా చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల వాదనలను మక్కల్ నిది మయం పార్టీ ఖండించింది. ఇలాంటి చర్యలకు తమ పార్టీ భయపడదని ఎజి.మౌర్య వెల్లడించారు.
అమితాబ్, చిరు కాంభినేషన్ లో మరో మూవీ !
అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ
‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్