Saturday, April 20, 2024
- Advertisement -

దృశ్యం సినిమా తలపించేలా హత్య..

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఎన్నో సస్పెన్స్ చిత్రాలు వచ్చాయి.. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’చిత్రం ఈ కోవలోకే వస్తుంది. చివరి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగే ఈ చిత్రం ఓ తండ్రి తన కూతురు ని కాపాడుకోవడానికి పడే కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ చిత్రం తమిళ, మళియాళ, హిందీ భాషల్లో వచ్చింది. తాజాగా దృశ్యం చిత్రం తలపించేలా ఓ హత్య ఘటన కేరళలోని కొల్లమ్ జిల్లాలో జరిగింది. అన్నను చంపి ఇంట్లో పాతి పెట్టి పోలీసులకు రెండు సంవత్సరాల పాటు దృశ్యం సినిమా చూపించాడు ఆ హంతకుడు.

షాజీ పీటర్ అనే వ్యక్తి మల్లాపూరమ్ జిల్లాలో పని చేస్తూ జీవనం సాగిస్తాడు. 2018లో ఓనమ్ పండుగ సందర్భంగా తన సొంతూరు ఏరూర్‌కు వచ్చాడు. తన తమ్ముడి భారపై కన్నువేశాడు పీటర్. తమ్ముడు షాజిన్ భార్య ఆర్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆర్య తన భర్తకు తెలియజేయడంతో షాజీని తన తల్లి, భార్యతో కలిసి తమ్ముడు హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఏం చేయాలో పాలుపోక ఇంట్లో పెరట్లో గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

అనంతరం మృతదేహం పాతిపెట్టిన స్థలంలో కాంక్రీట్ వేశారు. కొంత కాలంగా తన అన్న పనిచేయడానికి వేరే ఊరికి వెళ్లాడు అంటూ మభ్యపెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చుట్టు పక్కల వాళ్లకు అనుమానాలు వచ్చాయి. షాజీ కనిపించకపోవడంతో అతడి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కొడుకు కనిపించకుండా పోయినప్పటికీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులను పోలీసులు నిలదీశారు. తమకు ఏమీ తెలియదని చెప్పడంతో సంతృప్తి చెందని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా అసలు నిజం చెప్పారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్ వాయిదా!

మన గుండెల్లో కొలువైన సూపర్ మేన్ హనుమ : చిరంజీవి

అక్కడ పదిరోజుల లాక్ డౌన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -