Friday, April 26, 2024
- Advertisement -

ఎంపీ కాన్వాయ్​పై బాంబు దాడి..8 మంది మృతి..!

- Advertisement -

కారు బాంబు పేలుడులో 8 మంది మృతిచెందిన ఘటన అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​లో జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.మరో 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రుల్లో ఎంపీ మహ్మద్​ ఖాన్​ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

చట్టసభ్యుడు మహ్మద్​ ఖాన్​ వాహనశ్రేణి లక్ష్యంగా దాడి జరపగా.. పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సమీపంలోని వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -