Friday, March 29, 2024
- Advertisement -

కన్నకూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

- Advertisement -

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కనీ పెంచి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్న తల్లిదండ్రులు తమ కూతురిని దారుణంగా పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఇక ఈ దారుణంలో తోడబుట్టిన సోదరుడు కూడా పాల్గొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులు కొంతకాలంగా యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. కానీ ఆ యువతి అప్పటికే ఓ యువకుడిని ప్రేమించింది.. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో చెబుతూ వస్తుంది.

తాను ఆ యువకుడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని నిరాకరించింది. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు.. పెళ్లి విషయంపై యువతిని బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. ఈ విషయంపైనే మరోసారి యువతికి..కుటుంబ సభ్యులకు మద్య పెద్ద గొడవ జరిగింది. దీంతో, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురై, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలను ఆర్పేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఎంతగా వారిస్తున్నా సోదరుడు తాజుద్దీన్ యువతిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడని యువతి తండ్రి తెలిపాడు. ఈ సంఘటన అనంతరం యువతి అన్న తాజుద్దీన్ పరారయ్యడు.

విశాఖలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా? : ఎమ్మెల్యే రోజా ఫైర్

తెలంగాణలో థియేటర్లు ఓపెన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -