- Advertisement -
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడకుడలో స్థానికులు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. కిడ్నాపర్ అనుకుని చితకబాదారు. గ్రామానికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడని భావించిన గ్రామస్థులు.. హైమద్ అనే ద్విచక్ర వాహనదారుడిపై దాడికి దిగారు.
తాను ఎత్తుకెళ్లడం లేదని బాధితుడు ఎంత చెప్పినా వినకుండా చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. హైమద్ను వేల్పూర్ పోలీస్స్టేషన్కు తరలించారు.
అనంతరం గ్రామంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. బాలిక ద్విచక్రవాహనానికి అడ్డువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను హైమద్ పైకి లేపుతుండగా కిడ్నాప్ చేస్తున్నాడనుకున్న స్థానికులు అతనిపై దాడి చేసినట్లు వివరించారు.
6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా