- Advertisement -
ఇథియోపియాలోని పశ్చిమ బెనిషంగుల్-గుముజ్ ప్రాంతంలో చెలరేగిన హింసలో 80మంది పౌరులు మరణించారని ఆ దేశ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) ప్రకటించింది. మారణహోమాన్ని వెంటనే నిలిపివేయాలని, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది.
మెక్టెల్ ప్రాంతంలో హింస జరిగిందని ఇథియోపియా మీడియా వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారని.. దీనితోపాటు దాదాపు 100మంది వరకు మరణించారని తెలిపింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన హెచ్ఆర్సీ హింసకు దూరంగా ఉండాలని సూచించింది.
ఈ దేశంలో దాదాపు 80 గిరిజన జాతులున్నాయి. ఓవైపు వీటిని ఏకం చేయాలని ప్రధాని అభియ్ అహ్మద్ ప్రయత్నిస్తుంటే… మరోవైపు ఈ హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.