- Advertisement -
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన జనజ ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త ఇటీవలే కరోనా బారిన పడ్డారు. అతను హైదరాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. జనజ రెండ్రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు.
భర్తతో పాటు తనకూ కరోనా సోకిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ సోకడం వల్ల ఎవరూ భయపడొద్దని వైద్యులు చెబుతున్నారు. కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని.. ఒకవేళ వస్తే.. హోం ఐసోలేషన్లో ఉండాలన్నారు. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. అంతేకాని ఆత్మహత్యకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.