Friday, April 26, 2024
- Advertisement -

జ‌గ‌న్ దాడి కేసులో ఇద్ద‌రు యువ‌తులను అరెస్ట్ చేసిన పోలీసులు …

- Advertisement -

వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను సిట్ బృందం ప్రత్యేక విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా అతడిని విచారించడంతో పాటు అతడి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత వారంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసు విచారణ, నెమ్మదిగా సాగుతూ, రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. తాజాగా, ఈ కేసులో సంబంధముందన్న అనుమానంతో పోలీసులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వచ్చిన సిట్ బృందం, వీరిని అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించింది.

అయితే అతడు జగన్ పై దాడికి ముందు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఎక్కువసార్లు పోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఎయిర్ పోర్టుకు సమీపంలో శ్రీనివాసరావు ప్లాట్ లోని మరో గదిలో ఉన్న అమ్మాయిలు వీరేనా? అన్న విషయం పై పోలీసులు ఆరా చేస్తున్నారు. వీరిలో ఒకరు శ్రీనివాసరావు తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన సమయంలో వచ్చిన యువతిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయితో పలు మార్లు శ్రీనివాస్ మాట్లాడాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -