Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్ తరపున బన్నీ ప్రచారం!

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస చేరికలతో ఆ పార్టీ కేడర్‌లో సైతం జోష్ నెలకొంది. తాజాగా బీఆర్ఎస్‌ సీనియర్ నేతలు హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు,అలాగే సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా సీఎం రేవంత్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇక త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఎంపీ టికెట్ దక్కితే అల్లు అర్జున్ కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలో కాంగ్రెస్ లో పని చేసిన కంచర్ల..2014లో బీఆర్ఎస్‌లో చేరారు. ఇబ్రహీంపట్నం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత బీఆర్ఎస్ నుండి నాగార్జున సాగర్ టికెట్ కోసం ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. అయితే బీఆర్ఎస్ అధికారం కొల్పోవడంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -