Friday, May 3, 2024
- Advertisement -

బుల్‌షిట్… బాలయ్యను సైడ్ చేసేశారా?

- Advertisement -

ఏపీ రాజకీయాల నుండి నందమూరి బాలృష్ణ సైడ్ అయ్యారా…?చంద్రబాబు అరెస్ట్ అయిన రెండు రోజులు తర్వాత మధ్యలో మరో రెండు రోజులు హడావిడి చేసిన బాలయ్య ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు. దీనంతటికి కారణం అధినేత చంద్రబాబేనా అంటే టీడీపీ నేతలు సైతం అవుననే పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి చంద్రబాబు రిమాండ్ తర్వాత అన్ని తానై చూసుకున్నారు. ఏకంగా చంద్రబాబు సీటులోనూ కూర్చొని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇక చంద్రబాబు పని అయిపోయింది ఇక అంతా బాలయ్యే అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ వారి ఆశలు ఎక్కువ రోజులు నిలవలేదు. బాలయ్యను మెల్లగా సైడ్ ట్రాక్ చేసిన పవన్‌ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. జైలు నుండే తన కార్యచరణను పార్టీ నేతలతో వెల్లడిస్తూ బాలకృష్ణను సైలెంట్ అయ్యేలా చేయడం సక్సెస్ అయ్యారు.

తర్వాత అదే బాలకృష్ణతో తెలంగాణ టీడీపీ బాధ్యతలు తానే తీసుకుంటానని చెప్పించి ఏపీ పాలిటిక్స్‌ నుండి సైడ్ చేసేశారు. ఇక తాజాగా తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో బాలయ్యను మరింత బిజీ చేసేలా మొత్తం 119 స్ధానాల్లో 87 స్ధానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. త్వరలో అభ్యర్థుల పేర్లు, మేనిఫెస్టో విడుదల చేయనుండగా ప్రచార బాధ్యతలు మొత్తం బాలకృష్ణే చూసుకుంటారట. ఇదే విషయాన్ని టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. దీంతో ఏపీ రాజకీయాల నుండి బాలకృష్ణ సైడ్ అవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. మరి నిజంగానే బాలకృష్ణకు పొమ్మన లేక పొగ బెడుతున్నారా అంటే కాలమే సమాధానం చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -