Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

- Advertisement -

అందరూ అన్నట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్యను అనుమానించారనే అంశాన్ని రాజకీయం చేసుకుంటున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తు ఆయన.. నేడు తిరుపతిలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని ఈ వదల్లో అమాయకులు ప్రాణాలు కోల్పయారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విధ్వంసం మానవ తప్పిదం వల్లే వచ్చిందని ఆయన పరోక్షంగా అధికార పార్టీపై విమర్శలు ప్రారంభించారు. వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించిన.. ప్రభుత్వం మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరించిందన్నారు. ముందు చూపులేని ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో విధ్వంసం సంభవించిందన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని.. ప్రభుత్వం పరిహారం ఇచ్చేంత వరకు తాము పోరాటం చేస్తామని బాబు స్పష్టం చేశారు.

అయితే వదర ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు పరమర్శలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టతూ.. అసెంబ్లీలో వైసీపీ నేతలు తన భార్యపై నిందమోపారని చంద్రబాబు డప్పు కొట్టుకొని చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు అసెంబ్లీలో అన్నారో లేదో స్పష్టత లేకపోయినా చంద్రబాబు మాత్రం ఊరు రా దండోరా వేసుకుంటున్నారు అనే విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

తాను 40 సంవత్సరాలకు పైగా రాజకియాల్లో ఉన్నానని, 15 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించానన్న బాబు… తన నోటి నుంచి అలాంటి మాటలు ఎప్పుడూ రాలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లే అయ్యిందన్నారు. ఆ ముఖ్యమంత్రి తన నేతలను కంట్రోల్ పెట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత

ప్రభుత్వ సొమ్ము దోచేస్తున్నారు…

చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

-Ramesh Reddy Chilakala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -