Sunday, April 28, 2024
- Advertisement -

జగన్‌ మరో మూవ్..తాడేపల్లిలో కీలక సమావేశం

- Advertisement -

ఓ వైపు అభ్యర్థుల ప్రకటన మరోవైపు సిద్ధం సభలు వెరసీ ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే పార్టీ కేడర్‌కు తన లక్ష్యాలను, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించిన జగన్ రేపు తాడేపల్లి గూడెంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు రావాల్సిందిగా ఆహ్వానం వెళ్లింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుల కానున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న దానిపై నేతలకు వివరించనున్నారు జగన్. అలాగే వారి నుండి సలహాలు తీసుకోనున్నారు. అలాగే మేనిఫెస్టోలోని పలు కీలక అంశాలను నేతలకు చెప్పనున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -