కాపు ఓటు బ్యాంకుతో గట్టెక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ ప్రయోజనం పొందాలని భావిస్తోంది. అయితే చంద్రబాబుకు స్కెచ్కు మాస్టర్ స్కెచ్ వేశారు వైసీపీ చీఫ జగన్.
ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ చేశారు జగన్. అందుకే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో…ఆరు సీట్లను కాపులకే కేటాయించి మాస్టర్ స్కెచ్ వేశారు జగన్. రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున సిట్టింగ్లను మారుస్తూ ప్రయోగాలు చేస్తున్న జగన్..కాకినాడలో మాత్రం కాపు మంత్రానికే జై కొట్టారు.
కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో 60 శాతం కాపు ఓటర్లు ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు ఓటర్లు వైసీపీకే జై కొట్టారు. అందుకే ఈసారి ఆ సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు జగన్. సర్వే రిపోర్టులు, గెలుపు అవకాశాల ఆధారంగా కాపు సామాజిక వర్గానికే కేటాయించారు. ఇక కాపులు అంతా తమకే అనుకూలంగా ఉన్నారని చంద్రబాబు అండ్ కో భావిస్తున్న నేపథ్యంలో జగన్ వేసిన మాస్టర్ స్కెచ్తో బాబు మైండ్ బ్లాంక్ అయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.